కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్​.. రేపు వైసీపీలో చేరనున్న రామసుబ్బారెడ్డి

  • జమ్మలమడుగు టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి
  • సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్న వైనం
  • విజయవాడకు బయలుదేరిన రామసుబ్బారెడ్డి
కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. టీడీపీ నుంచి మరో నేత వైసీపీలో చేరనున్నారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి రేపు వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో రామసుబ్బారెడ్డి చేరనున్నారు. జమ్మలమడుగు నుంచి విజయవాడకు ఆయన బయలుదేరినట్టు సమాచారం. కాగా, టీడీపీ నుంచి బయటకొచ్చిన పులివెందుల నేత సతీశ్ రెడ్డి ఈ నెల 13న వైసీపీలో చేరనున్నారు.



Rama subba Reddy
Telugudesam
Jagan
YSRCP

More Telugu News